Wednesday, 1 September 2021

‘జాతిరత్నాలు’ హీరో కీలక నిర్ణయం.. అందువల్ల తీసుకున్న డబ్బు తిరిగిచ్చేశాడట

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. ఇక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాటపట్టాడు హీరో . అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కొందరు డైరెక్టర్ల దృష్టిలో అతను పడటంతో హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. తెలుగులో హీరోగా చేసిన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అతను మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘చిచోరే’ సినిమాలో తన నటనతో అలరించాడు. ఇక లేటెస్ట్‌గా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ‘జాతిరత్నాలు’ సినిమాలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు నవీన్. ‘జాతిరత్నాలు’ సినిమాతో నవీన్‌కు సినిమాలు క్యూకట్టాయి. విభిన్నమైన కథాంశాలతో అతనితో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఓ విభిన్నమైన కథతో నవీన్ వద్దకు ఓ చిత్ర యూనిట్ వచ్చిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందే ఈ సినిమాలో చేస్తానని డీల్ కుదుర్చుకున్న నవీన్.. అందుకు సంబంధించి నాలుగు కోట్ల రూపాయిలు అడ్వాన్స్ కూడా తీసుకన్నాడట. అయితే మొత్తం కథ విన్న తర్వాత తనకి నచ్చకపోవడంతో అందులో మార్పులు చేయాలని అతను కోరినట్లు తెలుస్తోంది. ఇక నవీన్ కోరిక మేరకు రచయితలు కథలో అతను చెప్పిన విధంగా మార్పులు, చేర్పులు చేశారట. అయినప్పటికీ.. నవీన్‌కు ఆ కథ నచ్చలేదట. దీంతో ఆ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సినిమా నిర్మాతలకు చెప్పి.. తీసుకున్న నాలుగు కోట్ల రూపాయిల అడ్వాన్స్ సొమ్మును వెనక్కి ఇచ్చేశాడట. ఇప్పటివరకూ తాను చేసిన విధంగా కాకుండా ఢిఫరెంట్‌గా ఉండే కథాంశంతో సినిమా చేయాలని నవీన్ ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకోసం స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. త్వరలో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yzhdoj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...