Saturday, 4 September 2021

‘పుష్ప’ అప్‌డేట్.. రెండో పాట విడుదలకు సిద్ధం.. దానికి ప్రాధాన్యత ఇస్తూ కంపోజ్ చేసిన దేవి శ్రీ

ఐకాన్ స్టార్ '' సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊహించినదాని కంటే ఎక్కువగా ఈ సినిమా టీజర్‌కు అద్భుమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూవ్స్, లైక్స్ సాధించింది ఈ సినిమా టీజర్. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే ల్యే’ అనే డైలాగ్ టీజర్ విడుదలైన రోజు నుంచి ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ మాస్ పాటని.. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్‌తో పాడించారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఇప్పటివరకూ విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్‌లలో హీరోయిన్ రష్మికకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో రెండో పాట పూర్తి రొమాంటిక్‌గా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా సంగీత దర్శకుడు దేవీ శ్రీ కంపోజ్ చేశారు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. మలయాళం సూపర్‌స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. నటుడు సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు . కరోనా ఉదృతి తగ్గడంతో ఈ మధ్యే ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h2e0aG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...