Sunday, 5 September 2021

దిశ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. సల్మాన్, అక్షయ్, రవితేజ, రకుల్.. సహా 40 మంది సెలబ్రిటీలను అరెస్ట్ చేయాల‌ని కేసు

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌... టాలీవుడ్‌లో ర‌వితేజ‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ... ఇలా దాదాపు 40 మంది సినీ సెల‌బ్రిటీల‌ను అరెస్ట్ చేయాలంటూ కేసు న‌మోదైంది. అస‌లేం జ‌రిగింది. ఇంత మంది సినీ సెల‌బ్రిటీలు ఒక్క‌సారిగా చేసిన త‌ప్పేంటి? అనే వివ‌రాల్లోకెళ్తే... సినీ సెల‌బ్రిటీల ప‌రిస్థితి అస్స‌లేం బాగోలేద‌ని ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే అన‌క త‌ప్ప‌డం లేదు. ఎందుకంటే ఒక‌వైపు డ్ర‌గ్స్ కేసులో ఈడీ సినీ సెల‌బ్రిటీల‌ను విచారిస్తుంది. ఈ విచార‌ణ ముగియ‌క‌ముందే మ‌రోసారి సినీ సెల‌బ్రిటీల‌ను అరెస్ట్ చేయాలంటూ కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆ కేసు పెట్టింది ఎవ‌రో తెలుసా!.. న‌వంబ‌ర్ 27, 2019లో ఓ అమ్మాయిని న‌లుగురు దుర్మార్గులు రేప్ చేసి దారుణంగా చంపేశారు. ఆ ద‌ర్ఘ‌ట‌న‌తో దేశం యావ‌త్తు అట్టుడుకింది. స‌ద‌రు బాధిత అమ్మాయికి దిశ అనే పేరుని పెట్టి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అయితే ఇలాంటి దుష్ప‌రిణామాలు జ‌రిగిన‌ప్పుడు అస‌లు పేర్ల‌ను ఉప‌యోగించ‌కుండా మారు పేర్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే దిశ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు బాలీవుడ్ స్టార్స్ స‌ల్మాన్‌ఖాన్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అక్ష‌య్ కుమార్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌, అనుప‌మ్ ఖేర్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్ స‌హా టాలీవుడ్ స్టార్స్ ర‌వితేజ‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, అల్లు శిరీష్‌, ఛార్మి బాధిత అమ్మాయి పేరుని సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన సెల‌బ్రిటీలు అలా చేయ‌లేద‌ని ఢిల్లీకి చెందిన గౌర‌వ్ గులాటి అనే న్యాయ‌వాది స‌బ్జీ మండీలోని పోలీస్ స్టేష‌న్‌లో సెక్ష‌న్ 228 ఏ కింద‌ కేసు న‌మోదు చేయ‌డ‌మే కాకుండా.. వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హ‌జారీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్పుడు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WURSYV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...