పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తోన్న మళయాలి రీమేక్ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను మన శైలికి తగ్గట్టుగా త్రివిక్రమ్ కథలో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ సెట్స్ మీదకువెళ్లింది. చకచకా షూటింగ్ను పూర్తి చేసేసుకుంటోంది. ఇప్పటికే వదిలిన మేకింగ్ వీడియోలు, స్టిల్స్ అన్నీ కూడా అందరినీ మెప్పించాయి. మరీ ముఖ్యంగా ఖాకీ డ్రెస్సులో ఉన్న ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా అంటూ పవన్ కళ్యాణ్ పాత్ర పేరును రివీల్ చేసిన క్షణం నుంచి సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతోన్నట్టు తెలిపారు. ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఈ మూవీకి టైటిల్ను ప్రకటించబోతోన్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక రవి కే చంద్రన్ కెమెరామెన్గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lWGxC5
v
No comments:
Post a Comment