మెగా హీరో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. చిత్రలహరితో గాడిన పడ్డ ఈ హీరో.. ప్రతిరోజూ పండుగే సినిమాతో మరో హిట్ కొట్టేశారు. అలా మంచి ఊపు మీదున్న సాయి ధరమ్ తేజ్కు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ మరో సక్సెస్ వచ్చింది. ఇలా వరుస సక్సెస్లతో దూసుకుపోతోన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కొత్త కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సాయి ధరమ్ తేజ్ అంటూ ముందుకు రాబోతోన్నారు. దేవాకట్టా వంటి దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ మూవీని ప్రకటించడంతోనే అంచనాలు పెరిగాయి. అయితే మధ్య మధ్యలో వదిలిన టీజర్లు, పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేడు సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. ఇక ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ పోషిస్తోన్న పాత్ర గురించి చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు. జిల్లా కలెక్టర్గా పంజా అభిరామ్గా నటించబోతోన్నట్టు ప్రకటించారు. అయితే అక్టోబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు తెలిపారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. జె భగవాన్, జె పుల్లారావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకు వదిలిన పాట బాగానే క్లిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AJIg1z
v
No comments:
Post a Comment