Thursday, 5 August 2021

Daggubati Venkatesh: ఇది చారిత్రాత్మక విజయం.. భారత హాకీ టీమ్‌పై వెంకీమామ ప్రశంసలు

ప్రపంచ జనాభా కన్ను టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న క్రీడా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే ఈ క్రీడల్లో భారత ఫురుషుల హాకీ టీమ్ సత్తా చాటడం చూసి స్టార్ హీరో దగ్గుబాటి ఫిదా అయ్యారు. భారత టీమ్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఫురుషుల హాకీ టీమ్ గెలుచుకుంది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది. 1980 ఒలింపిక్స్‌లో చివరిగా పతకం గెలిచిన భారత ఫురుషుల హాకీ టీమ్, 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఈ పతకం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఖుషీ అవుతున్నారు. తాజాగా దీనిపై వెంకటేష్ రియాక్ట్ అయ్యారు. ''భారత దేశానికి ఇది చారిత్రాత్మక విజయం. 1980 తర్వాత తొలి మెడల్. చాలా గర్వంగా ఉంది. హాకీ టీమ్ మొత్తానికి అభినందనలు'' అని పేర్కొంటూ వెంకటేష్ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ చూసిన వెంకీమామ ఫ్యాన్స్ పెద్దఎత్తున భారత హాకీ టీమ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌ లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. తాజాగా హాకీ టీమ్ కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది. వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఈ సినిమాపై వెంకీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న F3 మూవీతో బిజీగా ఉన్నారు వెంకటేష్. అతి త్వరలో ఈ నవ్వుల రైడ్ రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lyYoPm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...