Saturday, 28 August 2021

‘ఆమె దేశాన్ని గర్వించేలా చేసింది’.. మెడల్ విజేతను సత్కరించిన మెగాస్టార్

ఒలింపిక్స్.. ప్రతి అథ్లెట్‌కు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మెడల్ సొంతం చేసుకోవడం ఒక కల. ఎంతో చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్‌లో మెడల్ గెలవడం కాదు.. అసలు పాల్గొనడమే చాలా అదృష్టంగా భావిస్తుంటారు చాలా మంది. ఇక భారతదేశం నుంచి ఇప్పటికే చాలామంది అథ్లెట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని మెడల్స్ సొంతం చేసుకున్నారు.. దేశ ప్రతిభను ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం మన అథ్లెట్లు అదరగొట్టారు.. ఈ ఏడాది మన వాళ్లు ఒక బంగారు పతకంతో కలిపి ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో బ్యాడ్మింటన్‌లో సాధించిన కాంస్య పతకం ఒకటి. చైనాకి చెందిన హి బింగ్జియావోతో కాంస్య పతక పోరులో తలపడిన సింధు 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. దాంతో.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. గతంలో రియోలో 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలు గెలుపొందాడు. ఈ సందర్భంగా సింధుపై ప్రశంసల జల్లు కురిసింది. భారత్‌కు ఓ పతకం అందించేందుకు ఆమె చేసిన కృషిని ప్రధాన మంత్రితో సహా పలువురు ప్రముఖులు అభినందించారు. తాజాగా మెగాస్టార్ ఆమెకు సన్మానం చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తయి.. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘#Chiru154’ సినిమా ఫస్ట్‌లుక్‌లు విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BhsjjB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...