‘కష్టం వచ్చింది.. సాయం చేయండి’ అని వేడుకోవడమే ఆలస్యం.. నేనున్నానంటూ ముందుకొస్తున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. కరోనా వైరస్ మహమ్మారి కబలిస్తున్న ఈ కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా నిలిచారు. సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా అవతరించారు. అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నారు. మొదటి వేవ్లో తమ స్వగ్రామాలు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఎందరో వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించి ఆయన తన సేవతత్పరతను చాటుకున్నారు. అప్పటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఇక సెకండ్ వేవ్ సమయంలోనూ ఆయన రెట్టింపు ఉత్సాహంతో సేవలను అందిస్తున్నారు. సోషల్మీడియా ద్వారా అవసరంలో ఉన్న వాళ్ల వివరాలు తెలుసుకొని వాళ్లు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో దాన్ని పరిష్కరించేందుకు ఆయన స్వయంగా ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే తన సేవాకార్యక్రమాలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్న సోనూసూద్ తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్కి ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించనున్నారు. ఇది తనకు ఎంతో గర్వించే విషయం అని సోనూ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన ఛాంపియన్స్ కచ్చితంగా దేశాన్ని గర్వించేలా చేస్తారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rLHcqS
v
No comments:
Post a Comment