తమిళ సినిమా ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదం నెలకొంటూ ఉంటుంది. ఒక హీరోకి, మరో హీరోకి మధ్య గొడవ జరగటమో.. లేదా ఎన్నికల సమయంలో విబేధాలు రావడమో ఇలా ఏదో ఒకటి జరగడం అది వార్తల్లో నిలవడం మనం చాలా సార్లు చూశాం. కొద్ది రోజుల క్రితం కూడా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో ఆ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదం తెరమీదకు వచ్చి ప్రకంపనలు సృష్టించింది. ప్రముఖ తమిళ నటుడు శింబుపై, దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్ (ఫెఫ్సీ) అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కారణంగానే ఫెఫ్సీకి, తమిళ నిర్మాత సంఘం మధ్య విబేధాలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతో నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు శింబు సినిమాలకు తమ సహకారిన్ని అందించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు విషయానికొస్తే.. శింబు హీరోగా ఐసరిగణేశ్ నిర్మిస్తున్న సినిమాలో ఫెఫ్సీ కార్మికులు కూడా నటిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న కారణంగా షూటింగ్ అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు అని.. అందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ప్రత్యేక అనుమతి తీసుకువచ్చామని సెల్వమణి తెలిపారు. కానీ, శింబు నటించిన ‘అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్’ సినిమా వల్ల నిర్మాత మైఖేల్ రాయప్పన్కు తీవ్ర నష్టం వచ్చింది. అయితే అందుకు నష్టపరిహారం శింబునే చెల్లించాలని నిర్మాతల మండలిలో తీర్మాణం చేశారు. లేదంటే ఆయన సినిమాలకు ఎలాంటి సహకారం అందించమని నిర్మాతల సంఘం తేల్చి చెప్పేశారు. అయినప్పటికీ పెఫ్సీ కార్మికులు శింబు సినిమాలో పని చేయడం వల్లే తమకు, నిర్మాతల సంఘానికి వివాదం తలెత్తింది అని సెల్వమణి తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lKzegB
v
No comments:
Post a Comment