Tuesday, 10 August 2021

ట్రీట్‌మెంట్ వైజాగ్ వెళ్లిన చిరంజీవి.. వారం రోజులు అక్కడే! ఇంతకీ మెగాస్టార్‌కి ఏమైంది?

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కోసం వెళ్లారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న 'ఆచార్య' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. లూసీఫర్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. షూటింగ్ కోసం ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. అయితే అంతకంటే ముందే ఆయన ట్రీట్‌మెంట్ నిమిత్తం వైజాగ్ వెళ్లారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. డీటాక్సిఫికేష‌న్, రెజువెనేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా వైజాగ్ లోని ఆయుర్వేదిక్ స్పా సెంట‌ర్‌కి చిరనేజీవి వెళ్లారని సమాచారం. చిరు ఇదే స్పా సెంట‌ర్‌లో వారం రోజుల పాటు ఉన్నారట. ఆ స‌మ‌యంలో నిర్మాత దిల్ రాజు కూడా వెంట ఉన్నార‌ని తెలుస్తోంది. సాధారణంగా ఈ డీటాక్సినేషన్ కోసం మన హీరోలు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారు కానీ మెగాస్టార్ మాత్రం అందుకోసం వైజాగ్ వెళ్లారట. అక్కడి నుంచి రాగానే ఆయన లూసిఫర్ రీమేక్ సెట్స్ మీద కాలుమోపనున్నారని అంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న 'లూసిఫర్' తెలుగు రీమేక్‌కి సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు బయటకొచ్చాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో స‌త్యదేవ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ కథలో పలు మార్పులు చేర్పులు చేసిన చిత్రయూనిట్.. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పేర్లు పరిశీలించి చివరకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫిక్సయ్యారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు. విద్యాబాలన్ మెగాస్టార్‌కి సిస్టర్‌గా నటించబోతుందని, అలాగే హీరోయిన్‌గా నయనతారను ఫైనల్ చేశారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ywVdLw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...