Saturday, 7 August 2021

శంకర్-చరణ్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇక్కడా.. ఆ తర్వాత అక్కడా..?

భారత సినీ చరిత్రలోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు ఆయన. ‘జెంటిల్‌మేన్‌’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అప‌రిచితుడు’, ‘రోబో’, ‘2.0’ వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన. ఆయనే దర్శకుడు శంకర్‌. నుంచి సినిమా వస్తుందటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. అలాంటిలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరో శంకర్ దర్శకతంలో సినిమా చేస్తున్నారంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అలాంటి సినిమానే శంకర్ దర్శకత్వంలో, హీరో తేజ్ చేస్తున్న సినిమా. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు.. తానే స్వయంగా నిర్మిస్తున్న ఆచార్య అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ రెండు సినిమాల తర్వాత శంకర్, చరణ్‌ల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై చాలా రూమర్లు వచ్చాయి. తాజాగా మరో రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలను మొదటగా తెలంగాణాలో శంకర్ ప్లాన్ చేశారట. ఆ తర్వాత ఇక్కడ షూట్ అనంతరం విదేశాల్లో షూట్ కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ వచ్చే సెప్టెంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని కూడా సమాచారం. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3itCDOQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...