Friday, 27 August 2021

కోర్టు తీర్పుపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. ‘ఇదొక్కటే మిగిలింది’ అంటూ కామెంట్స్

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ . ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తాప్సీ.. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాష సినిమాలతో బిజీ అయింది. అయితే కొంతకాలం తర్వాత తెలుగులో సరైన సక్సెస్‌ రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడే సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే మళ్లీ దక్షిణాది ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది ఈ భామ. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘అనబెల్ సేతుపతి’ అనే సినిమాతో ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల అయింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా తెలుగు, తమిళ, హింది, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక తాప్సీ సినిమాలతో పాటు సామాజిక అంశాల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆమె తప్పుబట్టింది. చత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు ఇష్టం ఉన్నా, లేకున్నా భర్తతో లైంగిక చర్య చేయవచ్చు అంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అది అత్యాచారం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై తాప్సీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. అయితే ఒక స్త్రీకి ఇష్టం లేకుండా శృంగారంలోకి బలవంతం చేయడం కచ్చితంగా అత్యాచారమే అంటూ తాప్సీ పరోక్షంగా పేర్కొంది. ‘మనం వినాల్సిన వాటిలో ఇది ఒక్కట్టే మిగిలి ఉంద’ని వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు సోనా మెహపాత్రా కూడా ఈ తీర్పును వ్యతిరేకించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BgRL8H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...