ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ కాంబినేషన్ త్వరలోనే మన ముందుకు రాబోతోన్నట్టు తెలుస్తోంది. కోసం స్టార్ రైటర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ వంటి వారు పవన్ కళ్యాణ్ గురించి ఇది వరకు చెప్పిన విషయాలు ఎంతగానో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ స్థాయికి కథను సిద్దం చేయడం, తెరకెక్కించడం మామూలు విషయం కాదని దర్శకధీరుడు రాజమౌళి ఆ మధ్య అన్నారు. ఇక రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం పవన్ కళ్యాణ్ చరిష్మా మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్కు కథే అవసరం లేదని, ఆయన ఉంటే చాలు.. ఆయన్ను చూడటానికే జనాలు వస్తారని అన్నారు. పాటలు, ఫైట్లు, అక్కడక్కడా కొన్ని సీన్లు పేర్చితే కథ అయిపోతోందని, ఆయన స్థాయి వేరే.. డైనమైట్ అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు అభిమానుల్లో జోష్ను నింపాయి. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ కోసం తన పెన్నును విజయేంద్ర ప్రసాద్ కదిపాడని తెలుస్తోంది. తాజాగా ఓ కథను పవన్ కళ్యాణ్కి వినిపించారని, అది ఆయనకు తెగ నచ్చేసిందట. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైందట. కథ అయితే నచ్చింది కానీ దాన్ని తెరకెక్కించేది ఎవరు? అనే ప్రశ్న మొదలైందట. అయితే దర్శక నిర్మాతలను తానే సెలెక్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారట. దీంతో స్టార్ రైటర్ కథలో పవన్ కళ్యాణ్ను హీరోగా త్వరలోనే తెలుగు ప్రేక్షకులు చూడబోతోన్నారన్న మాట. వీటిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hoHaQI
v
No comments:
Post a Comment