Friday, 2 July 2021

Ekta Kapoor : బాలీవుడ్ మహిళామణులకు అరుదైన గౌరవం.. ఆస్కార్ బృందంలో చోటు

ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. సినీ రంగానికి చెందిన అత్యున్నత అవార్డు ఇదే. ప్రతీ ఒక్క నటీనటుడికి ఆస్కార్ అందుకోవాలనే కల ఉంటుంది. కానీ అది మన వరకు అందని ద్రాక్షే. ఇంత వరకు ఎవ్వరికీ కూడా ఉత్తమ నటుడు, నటి కేటగిరీలో ఆ అవార్డు దక్కనేలేదు. కానీ ఈ సారి మన దేశ మహిళా నటీమణులకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ పురస్కారాల్ని నిర్వహించే ‘అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’లో 2021 బృందంలో మన దేశం నుంచి ముగ్గురికి ఆహ్వానం అందింది. ‘ది క్లాస్‌ ఆఫ్‌ 2021’గా పిలిచే ఈ బృందంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులు, సాంకేతిక నిపుణుల్ని ఆహ్వానించారు. 395తో కూడిన ఈ జాబితాలో నటి విద్యాబాలన్‌, నిర్మాతలు ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌లు ఉన్నారు. ‘తుమ్హారీ సులు’, ‘కహానీ’ చిత్రాల్లోని నటనలకుగానూ విద్యా బాలన్‌కు ఈ గుర్తింపు దక్కింది. ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘వన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి’ చిత్రాల నిర్మాతగా ఏక్తాకపూర్‌, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘ది డర్టీ పిక్చర్‌’ చిత్రాల నిర్మాతగా శోభాకపూర్‌లకు ఈ గుర్తింపు దక్కింది. వీళ్లందరూ ఆస్కార్‌ పురస్కార గ్రహీతల్ని ఎంపిక చేసే ఓటింగ్‌లో పాల్గొంటారు. అలా మన వారు కూడా ఈ సారి ఆస్కార్ చిత్రాల ఎంపికలో ముఖ్య పాత్ర పోషించబోతోన్నారు. అయితే ఈ సారి మన సినిమాలు ఏవైనా ఆస్కార్ బరిలో నిలుస్తాయో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dET206
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...