Friday, 2 July 2021

జక్కన్న ట్వీట్‌‌కి దిగొచ్చిన ఢిల్లీ ఎయిర్ పోర్టు యాజమాన్యం.. కీలక మార్పులు

సోషల్ ఇష్యూస్‌పై సెలబ్రిటీలు స్పందిస్తే మార్పు ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియజెప్పే ఘటన ఇది. ఢిల్లీ విమానాశ్రయంలో పరిస్థితులు చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు . ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. అర్థరాత్రి సమయంలో కరోనా పరీక్షల కోసం కొన్ని పత్రాలు ఇచ్చి పూర్తి చేయమన్నారని.. ఆ ఫామ్స్ నింపడానికి కనీసం టేబుల్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో తనతో పాటు చాలామంది ప్రయాణికులు అవస్థలు పడ్డారని తెలియజేశారు. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే వీధికుక్కలు ఉన్నాయని చెప్తూ అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు. ఇలాంటి పరిస్థితులు విదేశీయులు చూస్తే వాళ్లకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి’ అంటూ ట్విట్టర్ వేదికగా చురకలేశారు రాజమౌళి. అయితే గతంలో కూడా చాలాసార్లు విమానాశ్రయంలోని సౌకర్యాలపై ప్రయాణికులు నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ సరైన స్పందనలు రాలేదు. అయితే తాజాగా జక్కన్న స్పందిస్తూ ట్వీట్ చేయడంతో ఈ ఇష్యూ వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు యాజమాన్యం దిగిరాక తప్పలేదు. రాజమౌళి ట్వీట్‌పై స్పందిస్తూ.. 'మీ విలువైన ఫీడ్ బ్యాక్ అందించినందుకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని.. ఇందుకు మీ సూచనల్ని పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీ-పీసీఆర్‌కి సంబంధించి కొన్ని డెస్క్‌లు ఉన్నాయని వాటి సంఖ్యను మరింత పెంచుతామని ఎయిర్ పోర్టు మేనేజ్ మెంట్ వెల్లడిస్తూ ట్వీట్లు చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V49Xmj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...