Thursday, 29 July 2021

రోజురోజుకీ ఓటీటీలకు పెరుగుతున్న క్రేజ్.. త్వరలో వెబ్‌సిరీస్‌లో స్టార్ హీరో?

అల్లు అర్జున్ హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వరుడు’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన నటుడు ఆర్య. ఆ తర్వాత ‘నేనే అంబానీ’, ‘రాజారాణి’, ‘క్రేజీ’, ‘సైజ్ జీరో’ తదితర సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఇందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉండగా.. కొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ‘టెడ్డీ’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఆయన నటించిన ‘సార్పట్ట’ అనే సినిమా కూడా ఓటీటీలోనే విడుదల అయింది. అయితే ఇప్పుడు స్టార్లు అందరు ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారు. కరోనా దెబ్బతో సినిమా రంగం కుదేలైపోయింది. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌, థియేటర్లు మూతబడటంతో ఆర్థికంగా తీవ్రనష్టం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో అప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఓటీటీలే దక్కుగా తోచాయి. థియేటర్లు విడుదల కావాల్సిన కొన్ని సినిమాలని లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదల చేశారు. దీని ద్వారా ఇంటి వద్దే ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచారు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా.. లాక్‌డౌన్ కారణంగా ప్లాట్‌ఫామ్‌కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ అనే సినిమా ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. దీంతో స్టార్ హీరోల చూపు ఓటీటీలపై పడుతోంది. తాజాగా ఆర్య కూడా ఓటీటీలో వెబ్‌సిరీస్ చేసేందుకు ఓకే అన్నారట. ఓ ప్రముఖ దర్శకుడి డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే వెబ్‌సిరీస్‌లో ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారని టాక్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఆర్య మాత్రం త్వరలోనే వెబ్‌సిరీస్ నటిస్తున్నారని కోలీవుడ్‌ వర్గాల్లో మాత్రం వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WxKpyJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...