Saturday, 17 July 2021

తారక్ తదుపరి సినిమాలో.. లీడ్‌రోల్‌లో రామ్ చరణ్ హీరోయిన్.. సినిమా బడ్జెట్ ఎంతంటే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత యంగ్ టైగర్ వెండితెరపై కనిపించలేదు. తారక్‌ని ఎప్పుడు వెండితెరపై చూస్తామని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తారక్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి అందుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అతను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ స్వతంత్ర పోరాటయోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతా రామరాజు పాత్రలో మెగా పవర్‌స్టార్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ మరో రెండు మేజర్ ప్రాజెక్టులు చేయనున్నాడు. అందులో ఒకటి దర్శకత్వంలో కాగా.. మరొకటి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను తారక్ సోదరుడు కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల, తారక్ కాంబోలో వస్తున్న రెండో సినిమా, తారక్ కెరీర్‌లో 30వ సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిన రోజు నుంచి ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్, సినిమా బడ్జెట్ గురించి ఓ ఆసక్తికర రూమర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో, ఆచార్య సినిమాలో రామ్‌ చరణ్‌తో నటించిన పూజా హెగ్డేని ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నారట. అంతేకాక.. పొలిటికల్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారనేది మరో వార్త. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమచారం లేదు. దీనిపై స్పష్టత రావాలంటే.. చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ieEpSE
v

No comments:

Post a Comment