ఛార్మింగ్ బ్యూటీగా వెండితెరపై ఫుల్ పాపులర్ అయిన .. ఆ తర్వాత కెమెరా ముందు నుంచి కెమెరా వెనుకకు చేరింది. హీరోయిన్గా సూపర్ ఫామ్ కొనసాగించి భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న తర్వాత నిర్మాత అవతారమెత్తింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగమవుతోంది. పూరి కనెక్ట్స్ పేరుతో ఓ సంస్థ పారంభించి దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటోంది ఛార్మి. మరోవైపు సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఛార్మి షేర్ చేసిన ఓ వీడియో ఆన్ లైన్ వేదికలపై వైరల్ అవుతోంది. ఫారెన్ లొకేషన్లో ఉన్న ఆమె పబ్లిక్గా సీసా పైకెత్తి లాగించేసింది. 'నిమ్మరసంలో అల్లంతో ఎక్స్ట్రా డోస్' అంటూ దీనిపై సింగిల్ లైన్ కామెంట్ చేసింది ఛార్మి. అయితే ఈ వీడియోలో ఛార్మి ఎదురుగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఆయన్ను దాచేస్తూ ఈ వీడియో కట్ చేసింది ఛార్మి. ఇక ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి ఎంజాయ్ అంటున్న నెటిజన్లు.. ముందుగా '' అప్డేట్ ఇవ్వండి మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ హిట్ అందుకున్న పూరి, ఛార్మి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. , ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై రౌడీ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qWr0mh
v
No comments:
Post a Comment