Tuesday, 27 July 2021

విజయ్‌ కేసుపై మద్రాస్ హైకోర్టు తీర్పు.. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటూ నెటిజన్స్ హంగామా!!

తమిళ సూపర్ స్టార్ విజయ్ లగ్జరీ కారు పన్ను విషయమై సంచలన తీర్పు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. 2012లో ఇంగ్లాండ్ నుండి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నారు విజయ్. అప్పటికే ఆ కారు కోసం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు దిగుమతి సుంకం చెల్లించారు. అయితే ఆ సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు ఇవ్వండి అంటూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్‌కు లేఖ రాయగా అధికారులు ఆయన వినతిని తిరస్కరించారు. వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కారుపై ఎంట్రీ టాక్స్ చెల్లించాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ, పన్ను మినహాయింపు ఇవ్వాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హీరో విజయ్. కొద్ది రోజుల క్రితం విజయ్ వేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం బెంచ్‌ తిరస్కరించి వెంటనే లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పన్ను చెల్లించే విషయంలో సినీ నటులు రూల్స్ పాటించాలి అని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ తర్వాత విజయ్ లాయర్లు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయడంతో మరో బెంచ్‌కు ఈ కేసును మార్చారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు సానుకూలంగా స్పందించి విజయ్‌కి విధించిన జరిమానాపై స్టే విధించింది. ఇదిలాఉంటే గతంలో విజయ్ నివాసంపై రెండు సార్లు ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేసి అంతా సవ్యంగానే ఉన్నాయంటూ అధికారులు ధ్రువీకరించారు. దీంతో మా హీరో ఎలాంటి తప్పు చేయరు, ఆయన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటూ నెట్టింట హంగామా చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f2sTsJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...