Saturday, 17 July 2021

సినీ అభిమానులకు శుభవార్త.. తెలంగాణలో థియేటర్లు తెరుచుకొనేది అప్పటి నుంచే..

కరోనా వైరస్.. కంటికి కనిపించని ఓ సూక్ష్మ జీవి.. ప్రపంచంలోని అగ్రదేశాలను కూడా గడగడలాడించింది. చైనాలో ఏదో మూలన పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పొట్టనపెట్టుకుంది. 2019లో తొలుత శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ని గుర్తించారు. ఆ తర్వాత క్రమంగా ప్రపంచదేశాలలో ఇది వ్యాపించడం కోట్లాది మంది దీని బారినపడటం కళ్లు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విధించాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో భారత్‌లో గత ఏడాది మార్చిలో ఈ లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను దశలవారిగా సడలిస్తూ వచ్చారు. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలో సినీ పరిశ్రమ ముందు ఉంది. షూటింగ్‌లు నిలిచిపోవడం, మూతపడటంతో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంతేకాదు.. కొత్త సినిమాలను థియేటర్లో చూడాలనే ఆశపడే ప్రేక్షకులకు కూడా నిరాశే ఎదురైంది. అయితే మొదటి వేవ్ లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త సినిమాలు మళ్లీ యధావిథిగా థియేటర్లలో విడుదల అవ్వడం జరిగింది. అయితే ఈ మురిపెం కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలింది. ఈలోపు సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ రంగప్రవేశం చేసింది. మొదటిసారి కంటే రెట్టింపు వేగంతో ఈసారి వైరస్ వ్యాప్తి చెందింది. భారతదేశ వ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ని అమలులోకి తెచ్చింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌ను అమలు చేసే పూర్తి అధికారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. దీంతో తెలంగాణలో ఈ ఏడాది మే 12వ తేదీ నుంచి స్వల్ప మినహాయింపులతో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. క్రమంగా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. లాక్‌డౌన్‌ని కూడా దశలవారిగా సడలిస్తూ వచ్చింది ప్రభుత్వం. గత నెల(జూన్ 19) నుంచి పూర్తిస్థాయిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. అన్ని వ్యాపారాలు కొనసాగించుకోవచ్చని ఉత్తర్వు జారీ చేసింది. అయినప్పటికీ థియేటర్లు వెంటనే తెరుచుకోలేదు. కొత్త సినిమాలు అందుబాటులో లేకపోవడం.. జనాలు థియేటర్లకు రావడానికి మొగ్గు చూపకపోవడం తదితర అంశాల వల్ల థియేటర్లను వెంటనే తెరవాలి అంటే యాజమాన్యాలు కాస్త వెనకడుగు వేశాయి. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ సినీ అభిమానులకు శుభవార్త అందించింది. జూలై 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు వందశాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోనున్నాయి అంటూ ఛాంబర్ ప్రకటన చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BbY1Q3
v

No comments:

Post a Comment