Saturday, 10 July 2021

కత్తి మహేష్ మరణంపై అనుమానాలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అతని మామయ్య

మూవీ క్రిటిక్ మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరుచేరడం వల్ల.. శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కత్తి మహేష్ చనిపోవడానికి కారణం అని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే కొంతమంది కత్తి మహేష్ సన్నిహితులు ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. జూన్ 26న నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. అయితే ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పటల్‌కి తరలించగా.. అత్యవరస చికిత్సను అందించారు. కత్తి మహేష్ తల నుదిటి భాగంలో ఎముక విరగడంతో పాటు.. కన్నుకి బలమైన గాయం కావడంతో శంకర నేత్రాలయ వైద్యులు పలు దఫాలుగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. అయితే మూడు వారాలు పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలియజేయడంతో కత్తి మహేష్ చెన్నై అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు చేసిన శస్త్రచికిత్సలు అన్నీ సక్సెస్ కావడంతో రేపో మాపో ఆసుపత్రి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని అనుకుంటున్న టైంలో కత్తి మహేష్ మరణవార్త షాకింగ్ అనే చెప్పాలి. ఈ తరుణంలో పలు అనుమానాలకు తావిస్తోంది. తన మేనల్లుడు నిన్నటి వరకూ ఆరోగ్యంగానే ఉన్నాడని.. శుక్రవారం నాడు వెంటలేటర్ కూడా తీసేశారని.. బాగున్నాడు కదా అని ఇంటికి వెళ్తున్న టైంలో అతని మరణ వార్త తెలిసిందని.. ప్రస్తుతం తాను చెన్నైకి వెళ్తున్నట్టు కత్తి మహేష్ మామయ్య తెలియజేశారు. అయితే కత్తి మహేష్ ఆరోగ్యం క్షీణించే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yHF0Tt
v

No comments:

Post a Comment