Monday, 7 June 2021

Sushant Singh : డ్రగ్స్ కాావాలంటూ మెసెజ్.. సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి సంచలన కామెంట్స్

బాలీవుడ్ ఇండస్ట్రీపై డ్రగ్స్, రేప్ కేసులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మరణంతో(జూన్ 14) బాలీవుడ్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. మొదటగా సుశాంత్ సింగ్ మరణాన్ని ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత అనేక మలుపుల తరువాత సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ మాఫియా కూడా ఎంటరైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఇందులో ఎన్సీబీ ఇప్పుడు ముందంజలో ఉంది. సుశాంత్ సింగ్‌కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చారని, అతని ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉందని నిర్దారణ అయింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ తదనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన మధ్యలో కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉంది. అయితే తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులకు రియా చక్రవర్తి కొన్ని విషయాలను చెప్పిందట. సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారట. సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సుశాంత్‌ చనిపోయే ముందు అంటే ఓ నాలుగైదు రోజుల క్రితం అనగా జూన్ 8వ తేదీన సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ చేశారట. లిబ్రియం పది గ్రాములు, నెక్సిటో కావాలని మెసెజ్ చేశారట. మొత్తానికి రియా చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. వీటిపై సుశాంత్ సోదరి ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pqGX3n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...