పాడుతా తీయగా.. ఈ రోజు మనం చూస్తున్న ఎంతోమంది ప్రముఖ గాయనీగాయకులను వెలుగులోకి తీసుకొచ్చిన చోటు. గీతా మాధురి, శ్రావణ భార్గవి, హేమ చంద్ర లాంటి స్టార్ సింగర్లను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన వేదిక ''. కాలం మారినా, ట్రెండ్ మారినా ఈటీవీ మటుకు సంవత్సరాల తరబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందంటేనే దీనికున్న ఆదరణ ఎలాటిందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రమణ్యం ఈ కార్యక్రమానికి ప్రధాన కిరీటం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన పేరు పైనే నడిచిన ఈ సూపర్ హిట్ షో, ఆయన తదనంతరం నడపడమంటే ఆలోచించాల్సిందే. ఆ ఆలోచనకి పదునుపెట్టి ఇప్పుడు 'పాడుతా తీయగా'ని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది ఈటీవీ బృందం. బాలు జయంతి సందర్భంగా ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ఒక విశ్వ గాయకుడి మృతి తర్వాత, పాడుతా తీయగా కార్యక్రమంలో ఆయన స్థానంలో కూర్చునే ధైర్యం ఎవరు చేస్తారు అని గత కొన్ని నెలలుగా ఎంతో మేధోమధనం చేసి, బాలు లాంటి మరో ప్రముఖ గాయకుడిని భర్తీ చేసే ధైర్యం మరెవరో చేస్తే లేనిపోని పోలికలు వస్తాయేమో అని, ఆయన కుమారుడైన ఎస్పి చరణ్కే ఆ బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది. చరణ్ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. చరణ్తో పాటు, సునీత, చంద్రబోస్లు కూడా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారనే టాక్ బయటకొచ్చింది. ఇప్పటికే కొన్ని పైలట్ ఎపిసోడ్లు షూట్ చేసినట్టుగా, వాటి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి తండ్రి పేరుని నిలబెట్టే విధంగా కొడుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాడా, పాడుతా తీయగాకి పూర్వ వైభవం వస్తుందా అనేది చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TLfNbB
v
No comments:
Post a Comment