Saturday, 5 June 2021

విరాటపర్వం OTTలోనా?.. ‘సమయం’తో అసలు విషయం చెప్పిన దర్శకుడు

ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ వేవ్ దెబ్బకు సినీ పరిశ్రమ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. గతేడాది దెబ్బకు ఇంకా కోలుకోని పరిశ్రమపై సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పెద్ద, పెద్ద సినిమాలన్నీ కూడా విడుదలకు క్యూ కట్టాయి. అందరూ తమకు అనుకూలంగా ఉండే డేట్లను ఫిక్స్ చేసుకున్నారు. కానీ సెకండ్ వేవ్ అందరి ఆశలను ఆవిరి చేసింది. ఎన్నో విభిన్న కథలు, మల్టీ స్టారర్లు, భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కూడా లైన్‌లోకి వచ్చాయి. కానీ ఇప్పుడవన్నీ సైడ్ అయిపోయాయి. వీటిలో కొన్ని చిత్రాలకు ఓటీటీ సంస్థలు గాలమేస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకత్వంలో రాబోతోన్న సినిమాపై ఓటీటీల కన్ను పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై ఇప్పుడున్న బజ్ అందరికీ తెలిసిందే. రానా, సాయి పల్లవి, నందితా దాస్, ప్రియమణి ఇలా ఎంతో మంది అద్భుత నటీనటులతో డైరెక్టర్ ఓ ప్రయోగాన్ని చేస్తున్నారు. మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద ఎర్రపతాకాన్ని ఎగరవేయాలని చూస్తున్నారు. అలాంటి విరాట పర్వం మీద ఓటీటీ రూమర్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆ మధ్య చిత్రయూనిట్ స్పష్టంగా చెప్పింది. తమ సినిమాను కేవలం థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పింది. కానీ మళ్లీ మళ్లీ అలాంటి రూమర్లే వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ‘సమయం తెలుగు’ తాజాగా దర్శకుడు వేణూ ఊడుగులను సంప్రదించింది. ఆయన ఈ రూమర్లను ఖండిస్తూ.. తమ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోమని, కేవలం థియేటర్లోనే విడుదల చేస్తామని ‘సమయం తెలుగు’తో క్లారిటీగా చెప్పారు. అలా డైరెక్టర్ మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టేశారు. ద‌గ్గుబాటి సురేశ్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3poVVXr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...