ప్రస్తుతం టాలీవుడ్లో సెగలు రేపుతోంది. ఈ సారి త్రిముఖి పోటి నెలకొనేలా ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆల్రెడీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే నటి హేమ కూడా తలపడేందుకు సిద్దమైంది. ఈక్రమంలో ఎన్నెన్నో వార్తలు, ప్రచారాలు ఊపందుకున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ మాత్రం దూసుకుపోయేందుకు తన టీంను రెడీ చేసుకున్నారు. ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్టు.. ఆరోపణలు, వాగ్వాదాలు, ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ మీద ఇప్పటికే విమర్శనాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పరభాషా నటుడు మా అధ్యక్షుడిలా ఉంటారు.. ఎలా ఎన్నుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ ఇలాంటివేమీ పట్టించుకోకుండా తన బలాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ మద్దతు లభించేసింది. ఇక తాజాగా తన ప్యానెల్ మెంబర్స్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సిని'మా' బిడ్డలం.. మనకోసం మనం.. 'మా' కోసం మనం.. త్వరలో జరగబోయే MAA ఎలక్షన్స్ని పురస్కరించుకుని, 'మా' శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. 'మా' టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నామని తన ప్యానెల్ టీంను పరిచయం చేశారు. జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్రావు మరికొందరు ప్రముఖులతో అంటూ ప్రకాశ్ రాజ్ తన లిస్ట్ను ప్రకటించేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35MQN6m
v
No comments:
Post a Comment