గతేడాది బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మరణం దేశవ్యాప్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో దర్యాప్తులు కొనసాగుతున్నాయి. అయితే (జూన్ 14) నిన్నటితో సుశాంత్ మరణించి ఏడాది గడవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు కూడా వెళ్లొచ్చిన ఆయన ప్రేయసి ఎమోషనల్ అయింది. మరోసారి సుశాంత్పై ఉన్న ప్రేమను బయటపెడుతూ పోస్ట్ పెట్టింది. ''నువ్వు లేవనే విషయాన్ని నమ్మకలేకపోతున్నా.. నువ్వే నా సర్వస్వం. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అంతా అంటారు. చంద్రుడి మీద నుంచి టెలిస్కోప్తో చూస్తూ ఇప్పుడు నన్ను కాపాడుతోంది కూడా నువ్వే అని నాకు తెలుసు. నన్ను తీసుకెళతావని నీ కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నా. నిన్ను తలచుకున్న ప్రతిసారీ నా గుండె ముక్కలైపోతోంది. నువ్వు నాతోనే ఉన్నావని నేను నమ్ముతున్నా. నువ్వు లేకుండా జీవితమే లేదు.. ఈ శూన్యత పూరించలేనిది. జీవిత అర్థాన్ని నువ్వు నీతో తీసుకెళ్లిపోయావు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఫిజిక్స్ పుస్తకాలు చదువుతా. దయచేసి మళ్లీ తిరిగి నా దగ్గరికి రావా. నా గుండె నిండా నువ్వే. ఐ మిస్ యూ మై బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్. మై లవ్'' అంటూ ఎమోషనల్ సందేశం పోస్ట్ చేసింది రియా చక్రవర్తి. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 34 ఏళ్ల సుశాంత్ 2020 జూన్ 14న తన ఇంట్లోనే చనిపోయారు. సుశాంత్ సింగ్ కేసు మొదటగా ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. కానీ అది చివరకు హత్యాయత్నం, హత్యకేసుగా ఆరోపణలు రావడంతో సీబీఐకి అప్పగించారు. దీంతో సుశాంత్ కేసు ఎన్నో మలుపులు తిరగడం, ఏకంగా ఐదు ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేయడం చూశాం. అయితే ఇప్పటివరకు ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pS0U3j
v
No comments:
Post a Comment