సినీ తారలను చూస్తే అభిమానులకు పట్టరాని సంతోషం కలుగుతుంది. ఒకప్పుడు అయితే ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూసేవారు. మధ్యలో ఫోటోగ్రాఫ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు అందరూ తమ అభిమాన నటీనటులతో సెల్ఫీలు దిగాలనే ఆశతో ఉంటున్నారు. అలా తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీలు అడుగుతారు. అందులో కొందరు ప్రేమగా తమ అభిమానులను రిసీవ్ చేసుకుని సెల్ఫీలు ఇస్తారు.. ఇంకొందరు మాత్రం తాటతీస్తుంటారు. అలా తాజాగా తనకు ఎదురైన ఓ ఘటనను వివరించారు. ఈ మేరకు రాజీవ్ కనకాల తన అభిమాని గురించి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాను ఒకసారి ఎయిర్ పోర్ట్కు వెళ్తే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడని, అతని కళ్లల్లో ఆనందం కనిపించిందని తనకు ఎదురైన ఘటన గురించి రాజీవ్ వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు.. ఈ ఫోటో 2018 సంవత్సరానికి చెందినది. ఆ రోజు చెన్నై ఎయిర్ పోర్ట్లో నా ఫ్లైట్ కోసం నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎయిర్ పోర్ట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ వ్యక్తి నా వద్దకు వచ్చాడు. అతని మొహంలో ఎంతో ఆనందం కనిపించింది.. నా దగ్గరకి వచ్చాడు.. తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు.. అతనికి సొంతంగా ఫోన్ లేకపోవడంతో.. నా ఫోన్లోనే ఓ సెల్ఫీ తీయమని అడిగాడు. అయితే ఈ ఫోటోను ఆ తరువాత పోస్ట్ చేద్దామని అనుకుని నేను మరిచిపోయాను.. అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.. ఆ వ్యక్తి ఈ ఫోటోను చూసి తీసుకుంటాడని ఆశిస్తున్నాను’ అని రాజీవ్ కనకాల తెలిపారు. దీంతో నెటిజన్లు రాజీవ్ కనకాల చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34JTyoP
v
No comments:
Post a Comment