స్టార్ హీరోలకు తన అభిమానులంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు తన అభిమానులంటే ఏంటో ప్రేమ. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయన తన అభిమానులకు అండగా నిలబడడమే గాక ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. తాజాగా ఓ అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన అభిమాని ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఈ ఫోన్ కాల్ చేశారు బాలకృష్ణ. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన మురుగేష్ (23) కొద్ది రోజుల క్రితం చెట్టు మీద నుంచి కిందపడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలిసి తన అభిమానికి నేరుగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు బాలకృష్ణ. అతని బాగోగులు, ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న బాలయ్య బాబు.. బాధితుడికి 40 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఫోన్లో మాట్లాడుతూ.. గతంలో తనకు జరిగిన ప్రమాదాలను బాలకృష్ణ అభిమానితో పంచుకున్నారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో తన నడుముకు తీవ్ర గాయమైందని, ధైర్యంగా ఉండటంతో తిరిగి కోలుకున్నానని చెబుతూ మురుగేష్కు ధైర్యం చెప్పారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇది పూర్తి కాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బాలకృష్ణ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iE02xC
v
No comments:
Post a Comment