Thursday, 24 June 2021

సీనియర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ శివన్ కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా, ఇతర ఆరోగ్య కారణాలతో సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఇండీస్ట్రీని కలవరపెడుతోంది. నేడు (జూన్ 24) ప్రముఖ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారులు తెలిపారు. శివన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి శివన్ అడుగు జాడల్లోనే నడిచిన రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా ఫేమస్ అయ్యారు. మిగిలిన ఇద్దరు కుమారులు సంగీత్, సంజీవ్ కూడా సినీ రంగంలోనే స్థిరపడ్డారు. శివన్ ఇకలేరనే వార్త తెలిసి సినీ వర్గాలు షాకయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 60 సంవత్సరాల క్రితం కేరళ రాజధాని తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియో పెట్టిన శివన్.. అంచెలంచెలుగా ఎదిగి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. ఆయన తీసిన ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు శివన్. ఆయన రూపొందించిన ‘అభయమ్’ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35LvSkg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...