Saturday, 5 June 2021

ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను.. రామ్ చరణ్ ఎమోషనల్

ప్రస్తుతం మన దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ దెబ్బకు అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది ప్రాణాలు గాల్లోకలిసిపోతోన్నాయి. ఆక్సిజన్ అందక ఎంతో మంది ఊపిరి వదులుతున్నారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ పూర్తైంది. దాదాపు అన్ని జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లు సేవలందించడం ప్రారంభించాయి. అయితే చిరంజీవి ఇంత చేస్తున్నా మీడియా కవర్ చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వివక్ష ఎప్పటి నుంచి ఉన్నదే అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ నిస్వార్థ సేవలు ఆపడం లేదు. ప్రతీ జిల్లాల్లో మెగా అభిమానులు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపై స్పందించారు. ‘అభిమానులు ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసలుకూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాబినందనలు. మీ అందరికీ అంకితభావానికి నా ధన్యవాదాలు’ అని రామ్ చరణ్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z46YcW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...