సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. అన్ని భాషల ఇండస్ట్రీలోని ప్రముఖులు రోజుకు ఎవరో ఒకరు మరణిస్తున్నారు. నేడు బాలీవుడ్ దు:ఖ సాగరంలో మునిగింది. బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకులు ద్వయంలోని లక్ష్మణ్(79) (సొంత పేరు విజయ్ పాటిల్) శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మరణించారు. అనారోగ్య సమస్యలతో ఆయన స్వస్థలమైన నాగ్పూర్లో మృతి చెందారు. ఎన్నో క్లాసికల్ హిట్స్ అందించిన లక్ష్మణ్ మరణంతో బాలీవుడ్ షాక్కు గురవుతోంది. కరోనా వ్యాక్సిన రెండు డోసులు వేసుకున్న లక్ష్మణ్ గత కొంత కాలం నుంచి అనారోగ్యానికి గురయ్యారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆయన తన తుది శ్వాసను విడిచారు. ఆయన మృతిపై ఎమోషనల్ అయ్యారు. సల్మాన్ నటించిన మైనే ప్యార్ కియా, పత్తర్ కే పూల్, హమ్ సాత్ సాత్ హై, హమ్ ఆప్కే హై కౌన్ వంటి బ్లాక్ బస్టర్లకు లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. ఆ విషయాన్ని తాజాగా సల్మాన్ ఖాన్ గుర్తుకు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తినివ్వాలని కోరుకున్నారు. ఇక కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధగా ఉంది.. నాకెంతో ఇష్టమైన కంపోజర్. ఎంతో మంచి మనిషి. ఆయన సారథ్యంలో నేను పాడిన పాటలెన్నో హిట్ అయ్యాయి. ఆయనకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oBG9Is
v
No comments:
Post a Comment