‘’ సినిమాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితగాథని కళ్లకు కట్టినట్లు తెరపై చూపించాడు దర్శకుడు . వైఎస్ఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఈ సినిమాలో చూపించి దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేశాడు అతను. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మమ్ముటీ నటించగా.. ఆశ్రితా వేముగంటి, సుధీర్ బాబు, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సూపర్ హిట్గా నిలిచింది. వైఎస్ఆర్ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సినిమాను చూసి.. మహి రాఘవను ప్రత్యేకంగా అభినందించారు. అయితే యాత్ర సినిమా తర్వాత మహి రాఘవ ఎలాంటి సినిమా చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పూర్తి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ‘యాత్ర’ను రూపొందించిన అతను.. ఇప్పుడు ఓ సెటైరికల్ కామెడీ స్క్రిప్ట్ని రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. ఈ సినిమాలో శ్రద్ధాతో పాటు.. పలువురు కమెడీయన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే పలువురు కామెడీయన్లను ఈ సినిమా కోసం ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ సినిమాలోని ప్రతీ పాత్రని జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు. అయితే ఇది కామెడీ జోనర్లో తెరకెక్కుతున్నప్పటికీ.. ఇందులోనూ తనదైన మార్క్ పొలిటికల్ టచ్ ఇవ్వనున్నాడట. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఉండే వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33kHv0l
v
No comments:
Post a Comment