Thursday, 6 May 2021

అది గూండా రాజ్యం.. కస్తూరీ శంకర్ కామెంట్స్ వైరల్

నాటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి శంకర్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలోని సమస్యలు, అన్యాయాలపై స్పందిస్తుంటారు. అంతేకాకుండా రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. స్వతాహాగా లాయర్ కావడంతో అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంటుంది. కస్తూరి శంకర్ చేసే కామెంట్లు ఒక్కో సారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌‌గా నిలుస్తుంటాయి. అలా తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనపై స్పందించారు. బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే అల్లర్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు దుండుగులు విదేశాంగశాఖ సహాయ మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో , కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై కస్తూరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికే ఇలా ఉంటే మామూలు జనం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎంతో సెక్యూరిటీతో వచ్చే కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. వారి కింది స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటో ఊహించలేకపోతోన్నాను.. వారు మనుషులేనా? అది గూండా రాజ్యంలా కనిపిస్తోందంటూ కస్తూరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరి శంకర్ ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అన్నమయ్య, భారతీయుడు వంటిచిత్రాలతో ఒకప్పుడు కస్తూరీ టాప్ ప్లేస్‌లో దూసుకుపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h6i0bl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...