Friday, 14 May 2021

‘బాలయ్యతో నటించాలంటే భయపడ్డా.. కానీ..’ ప్రగ్యా జైస్వాల్ సెన్సేషనల్ కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ . తొలి సినిమాతో మంచి సక్సెస్‌నే అందుకున్నా.. ఆ తర్వాత ఈ భామకి మంచి హిట్లు రాలేదు. సరైన అవకాశాలు లేక.. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది ప్రగ్యా. అయితే ప్రస్తుతం నందమూరి హీరోగా నటిస్తున్న ‘’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ప్రగ్యా.. సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలకృష్ణ పక్కన హీరోయిన్‌ అనగానే తొలుత భయపడ్డానని.. కానీ, ఆయన సెట్‌లో చాలా సరదాగా ఉంటారని ప్రగ్యా పేర్కొంది. ‘‘బాలకృష్ణతో సినిమా అనగానే చాలా భయపడిపోయాను. ఆయనకి కోపం ఎక్కువ అని కొందరు చెప్పడమే అందుకు కారణం. కానీ, సెట్‌లోకి వెళ్లాక పరిస్థితి అలా లేదు. ఆయన చాలా సరదాగా ఉంటారు. జోక్స్ వేస్తూ.. అందరినీ నవ్విస్తుంటారు. ఆయన అంత కూల్‌గా ఉండటం చూసి.. నేను చాలా ధైర్యంగా నటించాను. సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ప్రగ్యా తెలిపింది. ఇక ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఒకప్పటి హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తొలుత ప్రకటించిన ప్రకారం ఈ మే 28న విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో.. సినిమా విడుదల కూడా వాయిదా పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33MTgg4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...