ఆ మధ్య కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ స్కామ్లో చాలా మంది సినీ ప్రముఖ హస్తం ఉన్నట్లు బయటపడింది. అందులో ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించిన పేరు కూడా ఉంది. డ్రగ్స్ స్కామ్లో ఆమె ప్రొద్బలం ఉన్నట్లు రుజువు కావడంతో ఆమెకు కోర్టు జైలు శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆమె బెయిల్పై బయట ఉంది. అయితే తాజాగా సంజనా మరోసారి చిక్కుల్లోపడింది. తనపై ఆమె దాడి చేసిందంటూ.. ఓ ప్రొడ్యూసర్ ఆమెపై పోలీస్ కేసు పెట్టారు. 2019 క్రిస్మస్ వేడుకల్లో జరిగిన ఓ ఘర్షణలో తన కళ్ళకు గాయం చేసింది అంటూ సినీ నిర్మాత పోలీస్ కేసు పెట్టారు. తన ముఖంపై సంజన విస్కీ పోసి కంటికి గాయం చేశారని ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేశారు. లావెల్లె రోడ్డులోని కేజ్ క్లబ్లో జైన్ ఓ పార్టీలో పాల్గొన్నారు. అదే పార్టీలో గల్రానీ కూడా తన మిత్రుడితో ఉంది. రాత్రి 11 గంటల సమయంలో పరస్పర స్నేహితుడితో సంభాషణ ప్రారంభించడానికి జైన్ వారి టేబుల్ దగ్గరకు వచ్చారు. అయితే గల్రానీ ఆవేశంతో తనని దుర్భాషలాడిందని.. అంతేకాక, అక్కడ ఉన్న విస్కీ గ్లాస్తో తన ముఖంపై దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన లాయర్ వికాస్ ఉతయ్య వెల్లడించారు. గత ఏడాది లాక్డౌన్ ఉన్న కారణంగా ఈ ఘటనపై కేసు నమోదు చేయడం ఆలస్యం అయిందని ఆయన పేర్కొన్నారు. కబ్బన్ పార్క్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 326 ఎ - యాసిడ్ దాడి.. 335 - స్వచ్ఛందంగా తీవ్రమైన బాధ లేదా రెచ్చగొట్టడం.. 323 - దాడి 324 - ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించి దాడి.. 506 - క్రిమినల్ బెదిరింపు .. 504 - ఉద్దేశపూర్వక అవమానం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా సంజనను ప్రశ్నించలేదని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QnSjrE
v
No comments:
Post a Comment