Friday, 7 May 2021

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ అలా.. మంచు లక్ష్మీ ఇలా!

దావూద్ ఇబ్రహీం, వంటి వారి పేర్లు వినని వారెవ్వరూ ఉండరు. వీరి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అండర్ వరల్డ్ మాఫియా డాన్‌లుగా చెలామణి అయ్యారు. ఎంతో మందిని గడగడలాడించిన చోటా రాజన్ చివరకు కరోనాకు బలి అయ్యారంటూ గత కొంత సేపటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వల్ల రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక నేడు మాఫియా డాన్ చోటా రాజన్ మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్) లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అలా చోటా రాజన్ మృతి చెందాడంటూ వచ్చిన వార్తలపై , తమదైన శైలిలో స్పందించారు. రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్న చోటా రాజన్‌ అని కూడా భయపడకుండా.. కరోనా అతడ్ని చంపేసింది.. ఆయన దాన్ని ఎందుకు షూట్ చేయలేదో నాకింకా అర్థం కావడం లేదు.. దావూడ్ ఇబ్రహీం ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో అంటూ సెటైర్ వేశారు. ఇక మంచు లక్ష్మీ వెరైటీగా స్పందించారు. కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారు.. ఇలాంటి రాక్షసులందరినీ తీసుకుపో కరోనా అంటూ చెప్పుకొచ్చారు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నారు. ఈ మేరకు ఆయన మరణ వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33uAVnT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...