ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అమలుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. హైద్రాబాద్, రాష్ట్రం అంతటా కూడా కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో హైద్రాబాద్లో నిన్న స్వయంగా డీజీపీ, సీపీ సజ్జనార్ ఇలా అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి వాహనాలను చెక్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్పైనా లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఇక లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని, ఎవ్వరైనా కారణం లేకుండా, పాస్ లేకుండా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసేస్తామని హెచ్చరించారు. అత్యవసర వాహనాలు, అవసరాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే తాజాగా హీరో నిఖిల్ అత్యవసరంగా ప్రయాణించాల్సి వచ్చింది. అత్యవసరంగా మందులు ఇచ్చి ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ఉప్పల్ నుంచి కిమ్స్కు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే కోసం తొమ్మిది సార్లు ప్రయత్నించినా కూడా సర్వర్ డౌన్ అవ్వడంతో విఫలమయ్యాడట. ఈ పాస్ లేనందుకు పోలీసులు అడ్డగించారని చెప్పుకొచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీకి మినహాయింపు ఉంది కదా? అని నిఖిల్ ప్రశ్నించారు. అయితే దీనిపై హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. మీ లొకేషన్ను షేర్ చేయండి.. లోకల్ పోలీసులకు చెబుతామని అన్నారు. అలా మొత్తానికి నిఖిల్ చేసిన రిక్వెస్ట్కు పోలీసులు స్పందించారు. కరోనా కష్టకాలంలో నిఖిల్ ఎంతో మందికి సాయం చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/349xvaG
v
No comments:
Post a Comment