Thursday, 13 May 2021

జీవితంలో ఏం జరిగినా అదొక్కటే ఆప్షన్.. అందుకే అందరం వర్కౌట్‌ చేయాలి.. పూరి జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్

గతేడాది '' అంటూ ఎన్నో విషయాలపై ఓపెన్‌గా మాట్లాడిన డాషింగ్ డైరెక్టర్ మరోసారి ఈ విరామ సమయంలో వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో మన ముందుకొస్తున్నారు. పలు విషయాలపై స్పందిస్తున్న ఆయన తాజాగా 'బీ స్ట్రాంగ్' అంటూ ఓ ఆడియో రిలీజ్ చేసి ఓ మనిషి శారీరకంగా ధృడంగా లేకపోతే అతనిలో మానసిక స్థైర్యం ఎంత ఉన్నా అది వృథానే అని చెప్పారు. ''ఇన్నేళ్లు గడిచినా అనుకున్నది జరగలేదని బాధపడుతుంటాం. డోన్ట్‌ గివ్‌ అప్‌ బీ స్ట్రాంగ్‌ అని ఫ్రెండ్ చెబుతాడు. తండ్రి చనిపోయాడని ఏడుస్తుంటాం. 'బాధపడకు ధైర్యంగా ఉండు' అని అందరూ చెబుతుంటారు. ఇలా జీవితంలో ఏ కష్టం వచ్చినా అందరూ మనకు చెప్పేది బీ స్ట్రాంగ్‌ అని. వాళ్లు చెప్పింది నిజం కూడా. లైఫ్‌లో ఏం జరిగినా బీయింగ్‌ స్ట్రాంగ్‌ అనేది ఒకే ఒక ఆప్షన్‌ అయినప్పుడు మనం స్ట్రాంగ్‌ అయిపోవాలి. తప్పదు.. స్ట్రాంగ్‌ అవ్వకపోతే బతకలేం. స్ట్రాంగ్‌‌గా రెండు అంశాలు ముఖ్యం. అవే మానసిక స్థైర్యం, శారీరక బలం. స్ట్రాంగ్ పీపుల్‌కి కొన్ని లక్షణాలుంటాయి. అందులో ఒకటి కృతజ్ఞత. చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఎంతకాలమైనా గుర్తుపెట్టుకుంటారు. ఛాలెంజెస్ అంగీకరిస్తారు. వాటిని ఎదుర్కొవడానికి కృషి చేస్తారు. అందరితో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తారు. ఏ పని చేసినా అందులోని రిస్క్‌ని లెక్కిస్తారు. తమ గతాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అసౌకర్యం ఉన్నప్పటికీ సహిస్తారు. ఓటమిని అవకాశంగా మలచుకుంటారు. గివ్‌ అప్‌ అనేది ఎవరైనా చేస్తారు. ఏ పనినైనా మధ్యలో వదిలేసి పోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వదిలేసి పోవడానికి మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, చివరిదాకా నిలబడటానికి ప్రయత్నం చేయాలి.. నేర్చుకోవాలి. అయితే, శారీరకంగా నువ్వు ధృడంగా ఉండకపోతే.. నీకు ఎంత మానసిక స్థైర్యం ఉన్నా కూడా ఉపయోగం లేదు. అందుకే అందరం వర్కౌట్‌ చేయాలి. మీరు ఎక్సర్‌సైజ్‌ చేసినా చేయకపోయినా ఈ మూడూ ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక నిమిషంపాటు గోడకుర్చీ వేయగలుగుతున్నామా లేదా?, కుర్చీలో నుంచి ఒంటి కాలుపై లేవగలుగుతున్నామా లేదా?, మఠం వేసుకుని కింద కూర్చునప్పుడు రెండు చేతులు నేలమీద పెట్టకుండా పైకి లేవగలుగుతున్నామా లేదా?.. ఈ మూడూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇవి మీరు చేయలేకపోతే వృద్ధాప్యంలో కర్రలు, గోడలు పట్టుకుని నడవాల్సి ఉంటుంది. ఫిట్‌గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తేనే మీ పిల్లలు మాట వింటారు. నీ జ్ఞానాన్ని, తెలివితేటల్ని వాళ్లు అర్థం చేసుకుంటారు. వణుకుతూ, గోడ పట్టుకుని నడుస్తూ మీరు ఏం చెప్పినా ఎవరూ వినరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు'' అని పూరి జగన్నాథ్ చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ohxScn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...