Thursday, 20 May 2021

ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్.. మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ చాలా గట్టిగానే తగులుతోంది. వైద్యం కొరత, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని రోడ్డు పక్కనే ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ కోసం దేశం మొత్తం అల్లాడిపోతోంది. స్టీల్ ఫ్లాంట్లు ఉన్న రాష్ట్రం నుంచి దేశానికి ఆక్సిజన్ వస్తోంది. అలా ఒడిశా ప్రస్తుతం దేశానికి ఆక్సిజన్ అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది. ఇక ఇందులో సోనూ సూద్ కూడా ముందడుగు వేశారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎదురుచూసేవారికి సోనూ సూద్ ఆపద్భాందవుడిలా కనిపిస్తున్నారు. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను సోనూ సూద్ రప్పిస్తున్నారు. అలా ఎంతో మంది ప్రాణాలను సోనూ సూద్ రక్షిస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు రక్తం సరైన సమయంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని గ్రహించిన చిరు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి అద్భుత నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓ పోస్ట్ చేసింది. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా చిరంజీవి చిరంజీవే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి ప్రకటిస్తామని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wm9bOR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...