బాలీవుడ్ ఖిలాడీ నటిస్తున్న చిత్రం ‘’. ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే సినిమా నిర్మాణ సంస్థ పుజా ఎంటర్టైన్మెంట్స్ తాజాగా వీటిని ఖండిస్తూ.. సినిమా విడుదలపై స్పష్టత ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. అయితే ఓ వైపు థియేటర్లు మూతబడటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కొన్ని.. ఓటీటీలో విడుదల అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజాగా చిత్రం ‘బెల్ బాటమ్’. రంజీత్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్ ఖండించింది. తమ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం లేదంటూ సంస్థ స్పష్టం చేసింది. ‘‘మా చిత్రం బెల్ బాటమ్ గురించి వస్తున్న వార్తలు అన్నిటిని ఖండిస్తున్నాము. సరైన సమయం చూసి సినిమా విడుదలపై మేమే ప్రకటన చేస్తాము. మా సంస్థకు తప్ప.. సినిమా విడుదల గురించి ప్రకటన చేసే అధికారం ఎవరికీ లేదు. మా నుంచి ఎటువంటి సమాచారం లేకుండా.. మమ్మల్ని సంప్రదించకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను మేము కోరుతున్నాము’’ అంటూ పూజా ఎంటర్టైన్మెంట్ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అక్షయ్ సరసన వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. హ్యుమా ఖురేషీ, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2019 నవంబర్లో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా వ్యాప్తి చెందడటంతో షూటింగ్ని కొంతకాలం వాయిదా వేశారు. 2020 ఆగస్టులో మళ్లీ చిత్ర యూనిట్తో జతకట్టిన అక్షయ్.. రెండు నెలలోనే సినిమా షూటింగ్ని పూర్తి చేశారు. ఇక ఈ సినిమా టీజర్ని అక్టోబర్లో విడుదల చేశారు. తొలుత సినిమాను జనవర 22న విడుదల చేస్తామని ప్రకటించినా.. పరిస్థితుల ప్రభావం కారణంగా సినిమాను మే 28న విడుదల చేస్తామని ప్రకటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tksEOd
v
No comments:
Post a Comment