సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూ వార్తల్లో నిలవడంలో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ అనసూయ. ఎప్పటికప్పుడు తన జబర్దస్త్ అందాలతో కవ్విస్తూనే జనాల్లో హాట్ టాపిక్ అవుతుండటం ఆమె నైజం. తనపై ఎన్నిరకాలుగా ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత జోష్తో ముందుకెళ్తుంది రంగమ్మత్త. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ చూసి షాకవుతున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం ఇందులో గర్భంతో కనిపించడమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ.. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది ఈ హాట్ యాంకర్. తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంటూ ఆమె ఓపెన్ కావడంతో అంతా అవాక్కయ్యారు. ఒక్కసారిగా జనాల్లో ఈ విషయమై చర్చలు ముదిరాయి. ఇంతలో ఇప్పుడు ఏకంగా గర్భంతో ఉన్న ఫొటోనే షేర్ చేయడంతో దీనిపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. అనసూయ నిజంగా గర్భం దాల్చలేదు. ఇటీవలే ఆమె నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా లోని ఓ పిక్ బయటపెట్టింది అంతే. అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ఇటీవలే ఆహా ఓటీటీ వేదికపై విడుదలైంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తన సినిమాను ఇలా మరోసారి పోస్ట్ ప్రమోషన్ చేస్తూ అట్రాక్ట్ చేసింది అనసూయ. కాగా అనసూయ పోస్ట్ చేసిన ఈ పిక్ చూసి నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ ఆపి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి సాయం చేయండి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఈ వయసులో పిల్లలు కావాలా?, కంగ్రాట్స్ అను, కాకపోతే ఈ కరోనా టైమ్ అయిపోయాక ప్లాన్ చేసుకోవాల్సింది అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో అనసూయ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eWhTgT
v
No comments:
Post a Comment