Thursday, 27 May 2021

అలాంటి మెసెజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. రేణూ దేశాయ్ ఆగ్రహం

ప్రస్తుతం కోవిడ్ పేషెంట్స్ కోసం వీలైన సాయాన్ని చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. అయితే రేణూ దేశాయ్ తనకు వస్తోన్న ఆకతాయి సందేశాల గురించి పదే పదే చెబుతూ ఆవేదన చెందుతున్నారు. అవసరం ఉన్న వాళ్లు, ఆపదలో ఉన్న వాళ్లు మాత్రమే మెసెజ్ చేయండి, హాయ్, ఎలా ఉన్నారు వంటి పిచ్చి పిచ్చి మెసెజ్‌లు చేయకండని రేణూ దేశాయ్ వేడుకున్నారు. రేణూ దేశాయ్ ఎంతగా వేడుకున్నా కూడా కొందరు వినడం లేదు. తనకు వచ్చే అలాంటి సందేశాలతో అత్యవసరంలో ఉన్న కొంత మందిని మిస్ అయ్యే అవకాశం ఉంటుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. అలా రేణూ దేశాయ్ గత కొన్ని రోజులుగా రోగులకు చేతనైన సాయం చేస్తూ వస్తున్నారు. ఇందులోనూ కొందరు నెగెటివ్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. తమకు మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం, తమకు సాయం చేయకపోవడంతో కొంత మందిని తిట్టడం ప్రారంభించారు. వాటిపైనా రేణూ దేశాయ్ స్పందించారు. కొన్ని సార్లు మెసెజ్‌లు చూడలేకపోవచ్చు.. అయినా నేను సాయం చేయలేకపోతే మీరు నన్ను అడిగే హక్కు మీకు లేదు.. నేనేమీ మీరు ఓట్లు వేసి గెలిచిన నాయకురాలిని కాదంటూ ఘాటుగా స్పందించారు. ఇక తాజాగా రేణూదేశాయ్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆర్థిక సాయం చేయండంటూ తనకు మెసెజ్‌లు వస్తున్నాయని, తాను అసలు ఆర్థిక సాయం చేయలేనని, ఫుడ్, మెడిసిన్స్ వరకు సాయం చేయగలనని చెప్పుకొచ్చారు. అలా కాకుండా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఒకవేళ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసెజ్‌లు చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణూ దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wHfay1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...