దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సాధారణ, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బలి తీసుకుంటోంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరోనాతో కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. విశ్వశాంతి పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన ఎన్నో చిత్రాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిర్మాతగానే కాక దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్తో ''కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్థారకులు, పెత్తందార్లు'' లాంటి సినిమాలను ఆయన రూపొందించారు. ఇక దర్శకుడిగా ''తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం'' లాంటి సినిమాలను తెరకెక్కించారు. నగ్నసత్యం, హరిశ్చందుడ్రు చిత్రాలకు ఆయనకు జాతీయ అవార్డులు రాగా.. కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలకు రెండు నంది అవార్డ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన వయస్సు 90 పైనే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతిని పెళ్లి చేసుకున్నారు. మోహనకృష్ణ, శాంతి తనయుడే నందమూరి తారకరత్న. విశ్వేశ్వరరావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u4CBiQ
v
No comments:
Post a Comment