Saturday, 3 April 2021

Thank You: బ్యూటిఫుల్ హీరోయిన్‌తో ముచ్చటగా మూడోసారి అక్కినేని నాగ చైతన్య.. రియల్లీ క్రేజీ!!

సెలక్టెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ పట్టేస్తున్నారు యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం సాయి పల్లవితో చేసిన 'లవ్ స్టోరీ' మూవీతో బిజీగా ఉన్న చైతూ.. 'మనం' ఫేమ్ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న '' అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంలో నాగ చైతన్యతో జత కట్టే హీరోయిన్ విషయమై ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ 'థాంక్యూ' మూవీలో చైతూ జోడిగా అందాల కనిపించనుందని టాక్ నడుస్తోంది. లేటెస్ట్‌ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో నాగచైతన్య రొమాన్స్ చేయబోతున్నారని, అందులో ఒకరిగా రాశి ఖన్నా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య-రాశి ఖన్నా జోడీ 'వెంకీమామ' మూవీలో జోడీ కట్టారు. అలాగే 'మనం' సినిమాలోనూ చైతూ ప్రియురాలి పాత్రలో రాశి ఖన్నా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు నాగచైతన్య లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అప్‌డేట్స్ ఫుల్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా 'సారంగ దరియా' పాట సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి 'లవ్ స్టోరీ'పై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. సో.. చూడాలి మరి ఈ 'లవ్ స్టోరీ', ఆ 'థాంక్యూ' చైతూ కెరీర్‌ని ఎలా మలుపుతిప్పుతాయనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cO90ot
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...