Monday, 5 April 2021

Republic Teaser: వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్.. సాయి తేజ్ స్ట్రాంగ్ డైలాగ్స్

''ప్రతి రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్'' వంటి సినిమాలతో వరస హిట్స్ అందుకొని సూపర్ ఫామ్‌లో ఉన్న మెగా మేనల్లుడు నటిస్తున్న కొత్త సినిమా 'రిపబ్లిక్'. పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ క్యూరియాసిటీ పెంచేయగా తాజాగా విడుదల చేసిన 'రిపబ్లిక్' టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రాజకీయ నేపథ్యమున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన టీజర్‌లో ఆలోచింపజేసే సన్నివేశాలు చూపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ప్రజలు ఎలాంటి భ్రమలో ఉన్నారనే అంశాలపై ఫోకస్ పెడుతూ టీజర్ కట్ చేశారు. దీనికి తోడు సాయి ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. ''ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ, కట్టకుండానే కూలిపోతోన్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులన్న విషయం తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్లు, కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలుగా బతుకుతున్నారు. వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్'' అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది చెప్పకనే చెబుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతున్న ఈ 'రిపబ్లిక్' చిత్రానికి భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 4వ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ukn4vW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...