Monday, 19 April 2021

ఎంత పెద్ద సినిమా అయినా కరోనా ముందు తలొంచాల్సిందే.. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’లకు అవే కష్టాలు

దేశవ్యాప్తంగా రెండో దశలో ప్రతీ రోజు లక్షలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ఈ మహ్మమారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అదేస్థాయిలో కరోనా ప్రభావం ఉంది. గత ఏడాదితో పోలిస్తే.. రెట్టింపు వేగంతో కరోనా వ్యాప్తి అవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాయి. అవసరమున్న వాటిపై తప్ప.. మిగితా అంశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై పడింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కొన్ని సినిమాల విడుదలను.. షూటింగ్ దశలో ఉన్న సినిమాల షూటింగ్‌లను వాయిదా వేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు ఇందకు మినహాయింపు కాదు. కరోనా ముందు ఎంత బడా సినిమా అయినా తల వంచాల్సిందే. ఇప్పటికే కరోనా వ్యాప్తి కారణంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’.. నాగచైతన్య నటిస్తున్న థ్యాంక్యూ, గోపిచంద్-మారుతి సినిమాలు తమ షూటింగ్‌లను వాయిదా వేసుకన్నాయి. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ రూపొందిస్తున్న ‘’ సినిమాలు కూడా చేరాయి. యూనిట్‌లో కొందరు కరోనా బారిన పడటంతో షూటింగ్‌ను నిలిపివేస్తే బాగుంటుందని నిర్మాతలతో పాటు రాజమౌళి కూడా భావించారట. అందుకోసం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఆచార్య సెట్‌లోనూ మహమ్మారి ప్రభావం గట్టిగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ని కూడా నిలిపివేశారని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత మళ్లీ ఈ షూటింగ్‌లు ప్రారంభించే యోచనలో చిత్ర యూనిట్‌లు ఉన్నాయట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aoWw55
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...