Friday, 9 April 2021

‘ఉగ్రవాదులు ఆమె కోసం వచ్చినా.. ధైర్యంగా పోరాడింది’.. ‘మేజర్’ చిత్రం నుంచి శోభితా ఫస్ట్‌లుక్ విడుదల

26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మేజర్’. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. సైయూ మంజ్రేకర్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సైయీ మంజ్రేకర్ క్యారెక్టర్ పోస్టర్‌తో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క హైస్కూల్ రొమాన్స్‌లోకి ఒక స్నీక్ పీక్ ఇచ్చిన తరువాత ఆ అమరవీరుడి జీవితంలోని మరో ముఖ్య‌భాగాన్ని ఆవిష్కరించారు నిర్మాత‌లు. ఈ చిత్రం నుంచి శోభితా ధూళిపాల యొక్క ఫ‌స్ట్ గిమ్స్‌ని శుక్రవారం విడుద‌ల‌ చేశారు. ఉగ్రవాద దాడుల సమయంలో హోటల్ తాజ్‌లో చిక్కుకున్న బందీ పాత్రలో శోభితా ధూళిపాల నటించింది. ఆ ఘటన జరిగిన సమయంలో ఆమె పడిన వేదనని పోస్టర్‌లో కళ్లకు కట్టేలా చూపించారు. ‘ఉగ్రవాదులు హోటల్‌లోకి ప్రవేశించారు. ఉగ్రవాదులు ఆమె కోసం వచ్చారు. కానీ.. ఆమె వాళ్లతో ధైర్యంగా పోరాడింది’ అంటూ అడివి శేష్ ఈ పోస్టర్‌ని ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో శోభితా పాత్ర పేరు ప్రమోద అని ఈ సందర్భంగా వెల్లడించారు. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రం జులై 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wGGYDs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...