Saturday, 3 April 2021

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే.. కోవిడ్ నేపథ్యంలో షరతులు.. కేవలం వారికి మాత్రమే ఎంట్రీ

ఎట్టకేలకు పవర్ స్టార్ ‘’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో వకీల్ సాబ్‌ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున హైదరాబాద్ స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అసలే పవన్ కళ్యాణ్ అభిమానులు.. విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో 50 శాతం ఆక్యుపెన్సీతో రేపు (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహణకు పర్మిషన్ వచ్చింది. అయితే లిమిటెడ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. పరిమితంగా మాత్రమే పాస్‌లు ఇస్తున్నారు. ఈ పాస్‌లు ఉన్నవారు మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావాలని.. మాస్క్ లేకుండా వస్తే లోపలికి అనుమతించరని తెలియజేశారు ఈవెంట్ మేనేజర్లు. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో అందరి హీరోలు ఓ లెక్క.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క అనే పేరు ఉంది. ఏ ఈవెంట్‌కి వెళ్లినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ మాత్రం మామూలే. అయితే పవన్ కళ్యాణ్‌ని బిగ్ స్క్రీన్‌పై చూసి దాదాపు మూడేళ్లు అయ్యింది. దీంతో ఆయన భక్తులు పవన్ కళ్యాణ్‌ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ పయనం అవుతున్నారు. ఈ తరుణంలో లిమిటెడ్ పాస్‌లు ఇవ్వడం.. పైగా 50 ఆక్యుపెన్సీ అని కండిషన్లు పెట్టడంతో ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు వేదిక వద్ద ఎలాంటి రచ్చ చేస్తారోనని ఈవెంట్ ఆర్గనైజర్లు తలలు పట్టుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dumx3U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...