Monday, 5 April 2021

నా లైఫ్ ఎలా ఉండాలో వాళ్లు చెప్తారా? ఎవడో అనామకుడు చెప్తే నేను వినాలా?: నాగార్జున

చిత్రం విడుదల కావడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు కింగ్ నాగార్జున. ఈ చిత్రానికి విమర్శకుల ప్రసంసలు దక్కడంతో ప్రమోషన్స్‌లో పుంజుకున్నారు. తాజాగా రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారీ షోకి గెస్ట్‌గా వెళ్లిన వైల్డ్ డాగ్ మూవీ విశేషాలతో పాటు.. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆహాలో స్క్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాగార్జున సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు.. ఆరేడేళ్ల క్రితం ట్విట్టర్ కొత్తగా వచ్చిన టూల్ కాబట్టి అకౌంట్ ఓపెన్ చేశా.. కానీ కొన్నాళ్లు గడిచిన తరువాత ట్విట్టర్ టోటల్‌గా ఒపీనియేటెడ్.. నెగిటివ్‌గా మారిపోయింది. ఆ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ మనం మార్చేసుకోవాలి. నేను ఏం బట్టలు వేసుకోవాలి?? ఏం తినాలి?? అన్నీ వాళ్లే చెప్తారు. ఎవరో అనామకులు.. నాకు తెలియని వాళ్లు.. అసలు వాళ్లు ముఖం కూడా నేను చూసి ఉండను.. అలాంటి వాళ్లు నా లైఫ్‌ని డిసైడ్ చేస్తుంటారు. ముక్కుమొహం తెలియని వాళ్లు నా లైఫ్‌ గురించి మాట్లాడుతుంటే నా వల్ల కాలేదు. అందుకే ట్విట్టర్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేశా అని చెప్పారు నాగార్జున.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ul4eF2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...