Thursday, 29 April 2021

ప్రభాస్ దర్శకుడి కీలక నిర్ణయం.. ‘నేను సమ్మతిస్తున్నా..’ అంటూ అడివి శేష్ ట్వీట్

రెండో దశలో కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. కొంచం ఏమరపాటుగా ఉన్నా.. వైరస్ అంటుకుంటుంది. వైరస్ సోకిన రోగులు సరైన వైద్య సదుపాయాలు లేక.. ఆక్సిజన్ కొరతతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం మరోసారి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన లేదు. ప్రస్తుతానికైతే.. నైట్ కర్ఫ్య, వారాంతపు లాక్‌డౌన్‌తో సరిపెట్టేశారు. కానీ, వైరస్ కట్టడికి మాత్రం లాక్‌డౌనే సరైన మార్గం అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మహానటి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకొని.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా.. విధించకపోయినా.. వచ్చే రెండు వారాలు తనకి తాను వ్యక్తిగతంగా లాక్‌డౌన్ విధించుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రభుత్వం ప్రకటించినా.. లేకున్నా.. వచ్చే రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌లో ఉండాలి. అయితే లాక్‌డౌన్ ఎందుకు అని ప్రశ్నించే ప్రతీ ఒక్కరు.. ఒకసారి హాస్పిటల్స్‌కు వెళ్లండి. దయచేసి గత నెల రోజులుగా అక్కడ వైద్యులు, సిబ్బంది పడుతున్న కష్టాలను గమనించండి. మనం అందరం వ్యాక్సిన్ వేయించుకొని.. డాక్టర్లకు కాస్త ఉపశమనం కలిగించాలి’’ అంటూ అతను ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది సరైన నిర్ణయం కాదు అంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడమే కాక.. సరైన ఆదాయం లేక ఆకలిలో మరణించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నాగ్ అశ్విన్ ట్వీట్‌కి ప్రముఖ నటుడు అడివి శేష్ మద్దతు ఇచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని సమ్మతిస్తున్నట్లు అతను రీ ట్వీట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZERwM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...